బిల్లుల మంజూరులో పిటిషనర్ పాత్ర ఉన్నదని, ఇదే కేసులో ఒకొకరికీ ఒక్కొక్క విధంగా శిక్షలు విధించడాన్ని సవాల్ చేస్తున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఒకరికి ఇంక్రిమెంట్, మరొకరికి పెన్షన్లో 2% కోత, పిటిషనర్కు 30% కోత విధించడం వివక్షే అవుతుందని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఒకే కేసులో వేరువేరు శిక్షలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టంచేసింది. పెన్షన్లో 2% కోతను ఏడాదిపాటు విధిస్తూ మరో వ్యక్తికి అమలు చేసిన శిక్షనే పిటిషనర్కు అమలు చేయాలని తుది ఉత్తర్వులు జారీ చేసింది.