హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. తుది గడువు మంగళవారం ముగియగా, 7 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు తెలిపారు.