హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) స్క్రీనింగ్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్ఎంసీ సూచించింది. విదేశాల్లో వైద్య విద్య చదువుకొని తిరిగి వచ్చిన విద్యార్థులు భారత దేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్ఎంజీఈ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తారు. ఈ ఏడాది డిసెంబర్లో పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్ఎంసీ సూచించింది. రేపటి నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉన్నదని పేర్కొన్నది.