హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడంతో.. నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. రామగుండం మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం ఉత్తర్వ్యూలు జారీ అయ్యాయని మెడికల్ కాలేజీ అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీలో 150 సీట్లకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం అయినట్టేనని అధికారులు భావిస్తున్నారు.