బాచుపల్లి హాస్పిటల్ తప్పుడు లెక్కలు
నిజాంపేట మున్సిపాలిటీ నోటీసులు
దుండిగల్, జూన్ 20: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ఎస్ఎల్జీ దవాఖాన యాజమాన్యం సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు లెక్కలు చూపినందుకుగాను నిజాంపేట కార్పొరేషన్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. 21 రోజుల్లో దవాఖాన యాజమాన్యం కార్పొరేషన్కు జరిమానా మొత్తం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలోని ఎస్ఎల్జీ వైద్యశాల సుమారు నాలుగు ఎకరాల స్థలంలో ఉన్నది.
వైద్యశాల భవన నిర్మాణం కోసం హెచ్ఎండీఏ నుంచి 2 సెల్లార్లు, గ్రౌండ్+తోపాటు తొమ్మిది అంతస్తులకు అనుమతి పొందింది. కానీ, యాజమాన్యం అంతకుమించి అం తస్తులు నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. అయినా, వైద్యశాల యాజమాన్యం సెల్ఫ్ అసెస్మెంట్లో 4 అంతస్తుల్లో 32,300 చదరపు అడుగులు మాత్రమే వాడుతున్నట్టు పేర్కొని అధికారులకు నివేదిక అందజేసింది. దీనిపై విచారణ జరిపిన మున్సిపల్ అధికారులు భవనంలో దాదాపు 10 లక్షల చదరపు అడుగులు ఉన్నట్టు తేల్చారు. పెద్దమొత్తంలో ఆస్తి ప న్ను ఎగవేసేందుకు వైద్యశాల యాజమాన్యం యత్నించినట్టు గుర్తించారు. నూతన మున్సిపల్ చట్టం-2019 ప్రకారం ఎవరైనా సెల్ఫ్ అసెస్మెంట్లో ఆస్తి విలువ తక్కువగా చూపితే చెల్లించాల్సిన ఆస్తి పన్ను కంటే 25 రేట్లు అధికంగా జరిమానా చెల్లించాలని నిబంధనలు ఉండటంతో మున్సిపల్ అధికారులు సో మవారం యాజమాన్యానికి నోటీసులు అందజేశారు.