నిజామాబాద్: టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలకు సర్వ సిద్ధమయింది. హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతున్న ఈ వేడుకల్లో పాల్గొనడానికి నిజామాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పయనమయ్యారు. పార్టీ నుంచి అనుమతి పాసులు పొందిన నేతలు మాత్రమే ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 4 వందల మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది.
టీఆర్ఎస్ ప్లీనరీ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం మాదాపూర్ హెటెక్స్లో జరిగే ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్లీనరీకి చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.