బోధన్, జనవరి 20: నిజాం షుగర్స్ పునరుద్ధరణకు అధ్యయనం చేయడానికి ప్రభు త్వం ప్రత్యేక కమిటీ వేసిందని బోధన్ ఎమ్మె ల్యే పీ సుదర్శన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయ న నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు.
రైతు లు కోరుకున్నట్లయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీల ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సి ద్ధంగా ఉన్నదని తెలిపారు. ఫ్యాక్టరీలను తెరిపించేందుకు అవసరమైన అధ్యయనం కోసం ప్ర భుత్వం వేసిన కమిటీలో తనతోపాటు ఎమ్మె ల్సీ జీవన్రెడ్డి, మరికొంతమంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.