భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని నీతి ఆయోగ్ (Niti aayog) కార్యదర్శి సంజయ్ కుమార్ దర్శించుకున్నరు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అర్చక స్వాములు సంజయ్ కుమార్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందచేశారు.