హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఆయుర్వేద మందులపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీనికితోడు ఇంటర్నెట్ బోలెడు సమాచారాన్ని అం దిస్తున్నది. దీంతో ఈ మందుల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పుడిదే సమస్యగా మారింది. మార్కెట్లో నకిలీ ఆయుర్వేద మందుల ప్రవేశంతో అసలైన ఆయుర్వేద మందుల ప్రాముఖ్యత తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఈ క్రమంలో మార్కెట్లో దొరికే హెర్బల్ డ్రగ్స్(ఆయుర్వేద మందులు) పనితీరు, నాణ్యతను తెలుసుకునేందుకు జాతీ య పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) అధ్యయ నం చేస్తున్నది. అశ్వగంధ, శతావరి, కలబంద, ఉసిరి తదితర వన మూలికలతో చేసిన 112 రకాల మందులను ఆ సంస్థ పరిశీలించనున్న ది. నకిలీ ఉత్పత్తులను గుర్తించేందుకు ఎన్ఐఎన్ ప్రమాణాలు రూపొందించనున్నది.