హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంప ట్నం కుటుంబ నియంత్రణ చికిత్స బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలిసింది. బాధితులను పరామర్శిస్తూ.. ‘మంచి వై ద్యం అందుతున్నదా?’ అని ప్రశ్నించగా పలువు రు ‘మంచి చికిత్స అందుతున్నది.
అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు’ అని సమాధాన మిచ్చినట్టు సమాచారం. ఒకరైతే ‘ఉట్టిగ చూసిపోవుడేనా? ఏదైనా సాయం చేసేది ఉందా? ఉంటే వెంటనే చేయండి’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో గవర్నర్ కంగుతిన్నారని సమాచారం. బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తానని ఆమె మీడియాకు వెల్లడించారు.