హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆరే సతీమణి శిరీషను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో శిరీష తన నివాసంలో ఉండగా, ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే శిరీష ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
భర్త, కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండగా విచారణ, సోదాలు అంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా విజయవాడలో దుడ్డు ప్రభాకర్ను కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.