హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నంలోని ‘ముంచింగిపు ట్ట కుట్ర’ కేసులో మావోయిస్టు పార్టీకి చెందిన రామక్కగిరి చంద్రను 8వ నిందితుడి గా చేరుస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. యువతను మావోయిస్టు భావజాలం వైపు నడిపిస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టి విలువైన ఆధారాలు సేకరించామని ఎన్ఐఏ పేర్కొన్నది.
రామక్కగిరిపై ఐపీసీ, ఉపా చట్టాల కింద కేసులు నమోదు చేయడంతోపాటు పిస్టల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నది.