హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్ర పన్నాడన్న కేసులో నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు సంజయ్ దీపక్రావుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
ఆయనపై ఐపీసీతోపాటు, ఉపా చట్టం, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.