Hizb-Ut-Tahrir | హైదరాబాద్ : హిజ్జుత్ తహ్రీర్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరొకరిని అరెస్టు చేసింది. పరారీలో ఉన్న సల్మాన్ను హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. దేశంలో షరియా చట్టం అమలుకు హిజ్జుత్ తహ్రీర్ కుట్ర చేసినట్లు పేర్కొంది. భోపాల్, హైదరాబాద్ కేంద్రంగా హిజ్జుత్ తహ్రీర్ కార్యకలాపాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ ఏడాది మే 24న హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి, 16 మందిని అరెస్టు చేసింది. సల్మాన్ అరెస్టుతో ఆ సంఖ్య 17కు చేరింది. హైదరాబాద్లో అరెస్టు అయిన సల్మాన్ హిజ్జుత్ తహ్రీర్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. మే 24న హైదరాబాద్లో సలీం, మరో ముగ్గురిని ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో సలీం నేతృత్వంలో హిజ్జుత్ తహ్రీర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.