చెన్నై: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఎన్జీటీ విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేసినట్లు ఎన్జీటీ చెన్నై బెంచ్ ప్రకటించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంపై మహబూబ్నగర్లోని నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఈ పిటిషన్ వేశారు. పని ఆపాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కార్యకలాపాలు జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ఫొటోలను అందించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్జీటీ చెన్నై బెంచ్.. కృష్ణా బోర్డు నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించింది.
ప్రాజెక్టు పనుల ప్రాంతాన్ని ఈ బృందం సందర్శించింది. అనంతరం నివేదిక సిద్ధం చేసి ఎన్జీటీ ముందుంచింది. నివేదిక పరిశీలించిన తర్వాత రెండు రాష్ట్రాల వాదనలను ఎన్జీటీ విన్నది. ఈ క్రమంలో ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ముందు రెండు రాష్ట్రాల వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసినట్లు ఎన్జీటీ చెన్నై బెంచ్ తెలిపింది.
కోర్టు తీర్పు అమలు చెయ్యకపోతే తీసుకోవాల్సిన చర్యలపై కూడా మార్గదర్శకాలు జారీ చేస్తామని జస్టిస్ రామకృష్ణన్, డాక్టర్ కె. సత్యగోపాల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.