హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన చాంబర్లో ఉదయం 9.30కు ఈ ముగ్గురితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పలువురు నేతలు హాజరుకానున్నారు.