హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 80,470 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 366 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారినపడిన వారిలో 345 మంది కోలుకున్నారు. ఇవాళ ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,56,098కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,45,939 మంది కోలుకున్నారు. మొత్తం మరణాలు 3,864కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.