సుల్తాన్బజార్, జనవరి 8: తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాత కమిటీ గడువు ముగియడంతో ఆదివారం నిర్వహించిన అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్ రాములు, ప్రధాన కార్యదర్శిగా రమేశ్ పాక, సెక్రటరీ జనరల్గా ఎస్పీఆర్ మల్లేశ్కుమార్ను ఎన్నుకున్నారు. సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం శ్రీనివాస్ శంకర్రావు, కోశాధికారిగా దోవ శ్రీనివాస్కుమార్ ఎన్నికయ్యారు.
సెంట్రల్ కమిటీలో ఐదుగురిని, రాష్ట్ర కమిటీలో 9 మందిని ఉపాధ్యక్షులుగా, 15 మందిని కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎస్పీఆర్ మల్లేశ్కుమార్ తెలిపారు. అన్ని జిల్లా కమిటీలను కూడా ఎన్నుకున్నట్టు చెప్పారు. ఈ కమిటీలు రెండేండ్లపాటు కొనసాగుతాయని తెలిపారు.