హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): వొకేషనల్ కోర్సులు, సిలబస్ను మార్చేందుకు ఇంటర్విద్యశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. వర్తమాన అవసరాలు, మార్కెట్ డిమాండ్కు అవసరమైన సిలబస్ను రూపొందించేందుకు ప్రతిష్ఠాత్మక సెంచూరియన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొన్నారు. రాష్ట్రంలోని 184 జూనియర్ కాలేజీల్లో.. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, హోమ్సైన్స్, పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, హ్యుమానిటీస్ వంటి 22 రకాల వొకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటి సిలబస్, కరిక్యులం అప్పుడెప్పుడో రూపొందించింది కావటంతో విద్యార్థులు నైపుణ్యాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త సిలబస్ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.