హైదరాబాద్లో నూతన సచివాలయం నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వందల మంది కార్మికులు 24/7 మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ.. సెక్రటేరియట్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేసేందుకు పెద్దఎత్తున యంత్రాలను వినియోగిస్తున్నది. రాత్రివేళల్లో విద్యుత్తు లైట్ల వెలుతురులోనూ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.