హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి మానవత్వాన్ని చాటారు. వివిధకారణాలతో దివ్యాంగులుగా మారిన ఏడుగురికి మంగళవారం హైదరాబాద్లో మూడుచక్రాల (స్కూటీ) వాహనాలను అందించారు. ఉగాది నాడు వారి జీవితాల్లో నూతనోత్సాహం నింపారు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ పురానాపూల్కు చెందిన సూర్యప్రకాశ్, కుత్బుల్లాపూర్కు చెందిన సయ్యద్ సలీమ్, సిరిసిల్లకు చెందిన పోచంపల్లి శ్రీనివాస్, శేఖర్, ఖానాపూర్కు చెందిన సుధాకర్, వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన భరత్, షబానా వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారారు. తమ పరిస్థితిని సోషల్మీడియా ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లి సాయం అర్థించారు. ఆమె తక్షణమే స్పందించి.. వారితో నేరుగా మాట్లాడి అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.