హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలోని చండూరును ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డివిజన్లో 5 మండలాలను చేర్చారు. నల్లగొండ డివిజన్ నుంచి చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలను, దేవరకొండ నియోజకవర్గంలోని నాంపల్లి, మర్రిగూడ మండలాలను కలుపుతూ చండూరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు.