నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన వల్ల అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.
దేశంలో ఎకడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టడంతోపాటు హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రూ.10 లక్షల చొప్పున సాయం అందజేస్తున్నారని గుర్తుచేశారు.