హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యాసంవత్సరం నుంచి ఓయూ, తెలంగాణ మహిళా వర్సిటీలో కొత్తగా ఎమ్మెస్సీ డాటా సైన్స్ కోర్సు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కోర్సులో చేరడానికి బీఎస్సీ డాటా సైన్స్ పూర్తిచేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరొకసారి కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) నోటిఫికేషన్ను ఆదివారం కన్వీనర్ పాండురంగారెడ్డి విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుంది. వివరాలకు www.osmania.ac.in, https:// cpget.tsche.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని పాండురంగారెడ్డి తెలిపారు. 2020 -21విద్యాసంవత్సరంలో బీఎస్సీ డాటాసైన్స్ కోర్సును ప్రవేశపెట్టారు. ఆరు వర్సిటీల పరిధిలో 124 కాలేజీల్లో ఈ కోర్సును ప్రారంభించిన విషయం విదితమే.