న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం జాబ్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇదే సమయంలో కెరీర్కు సంబంధించిన విషయాల్లో కొంగొత్త నిర్ణయాలు తీసుకొనేలా ఉద్యోగులను పురిగొల్పింది కూడా. దేశంలో 71 శాతం మంది ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగంలో ఇమడలేకపోతున్నామని చెబుతున్నారు. వీలైతే, కెరీర్ను కొత్తగా ప్రారంభించాలనుకొంటున్నట్టు పేర్కొంటున్నారు. దేశంలోని 1,219 కంపెనీల యాజమాన్యాలు, 1,511 ఉద్యోగులపై అక్టోబర్, నవంబర్ 2021లో వ్యాల్యూవాక్స్ చేసిన సర్వే ఆధారంగా ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ ఈ మేరకు వెల్లడించింది.
కొవిడ్ సమయంలో ఇంటి నుంచి పనిచేయడం వల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్నప్పటికీ, ఆఫీసులో కంటే ఎక్కువ గంటలు పనిచేయవలసి వస్తున్నదని వాపోతున్నారు. వారానికి 5 రోజు ల చొప్పున రోజుకు 6-8 గంటలు పనిచేసినట్టు 57 శాతం మంది పురుషులు పేర్కొన్నారు.