సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 4: బంధువులతో కళకళలాడాల్సిన పెండ్లి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకున్నది. డెకరేషన్ లైటింగ్ తీగ తగిలి నవ వరుడు మృతి చెందాడు. పెండ్లయిన మరునాడే రిసెప్షన్ కోసం ఇంట్లో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా దుర్ఘటన చోటుచేసుకున్నది. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్కు చెందిన పెంటాచారి, జయలక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు. అందరి కంటే చిన్నవాడైన కుమారుడు నారోజు నిరంజన్ (34) సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
ఈ నెల 2న నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన యువతితో వివాహమైంది. సోమవారం మధ్యాహ్నం సిద్దిపేటలోని స్వగృహంలో రిసెప్షన్ జరుగాల్సి ఉన్నది. ఉదయం 5 గంటలకు ఇంటిపై వేసిన అలంకరణ విద్యుత్తు దీపాలు వెలగడం లేదని డాబాపైకి వెళ్లిన నిరంజన్.. వాటిని సరి చేసే క్రమంలో తీగలు చేతికి తగిలి షాక్తో అక్కడిక్కక్కడే మృతిచెందాడు. ఉదయం 6 గంటలు అయినా నిరంజన్ కనిపించకపోవడంతో డాబాపైకి వెళ్లిన కుటుంబసభ్యులకు విగత జీవిగా కనిపించగా బోరున విలపించారు.