హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పులు చేస్తూ శనివారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉండగా, మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఈ రైలును రీషెడ్యూల్ చేశామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని పేర్కొన్నారు.