హైదరాబాద్ : తెలంగాణలో తొలిసారి వంద లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి తాజాగా మరో 311 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1710 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 17022 కరోనా నిర్ధారణ పరీక్షలను అధికారులు నిర్వహించారు.