ఖైరతాబాద్, మార్చి 3 : జవహర్లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు నూతన డైరెక్టర్లు కొలువుదీరారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సొసైటీ ఎన్నికలు జరుగగా, టీమ్ జేఎన్జే ప్యానల్, ఫ్రెండ్స్ ప్యానెల్లు పోటీపడ్డాయి. 13 మంది సొసైటీ సభ్యులు ఈ పోటీలో నిలిచారు. పీవీ రమణారావు 528 ఓట్లు, ఏ వంశీ 430, రవికాంత్రెడ్డి 428, కిరణ్కుమార్ 401, అశోక్రెడ్డి 392 ఓట్లతో మొదటి, రెండో, మూడో, నాలుగో, ఐదో స్థానంలో నిలిచారు. ఫ్రెండ్స్ ఫ్యానెల్ నుంచి ముగ్గురు, టీం జేఎన్జే ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు. బరిలో 13 మంది నిలువగా మొత్తం 87.2 శాతం పోలయ్యాయి.