న్యూఢిల్లీ, జూలై 4: త్వరలో జరగనున్న వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్ఠానం నాలుగు రాష్ర్టాలకు పార్టీ అధ్యక్షులను మార్చింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, ఝార్ఖండ్ చీఫ్గా మాజీ సీఎం బాబూలాల్ మరాండీలను నియమించింది. పార్టీ పంజాబ్ శాఖ అధ్యక్షుడిగా సునీల్ జాకఢ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని నియమించింది. తెలంగాణలో ఓబీసీ నేత ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. కొత్త బాధ్యతల నేపథ్యంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగే అవకాశం ఉన్నది.