హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెహ్రూ జూపార్క్తోపాటు ఇతర పార్క్లను అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి అప్గ్రేడ్ చేయనున్నట్టు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. 60 ఏండ్లు పూర్తి చేసుకున్న నెహ్రూ జూపార్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని అరణ్యభవన్లో మంత్రి అధ్యక్షతన జపాట్ (జూపార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) పాలకమండలి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో నెహ్రూ జూపార్తోపాటు రాష్ట్రంలోని మిగతా జంతు ప్రదర్శనశాలలను మరింత అభివృద్ధి చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో సందర్శకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆకర్షణీయమైన జంతువులను దిగుమతి చేసుకోవడం, పులి, సింహం ఎన్క్లోజర్లను గ్లాస్ పార్టీషన్తో అతిదగ్గరి నుంచి చూసే ఏర్పాటు, సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు, పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుపై సమావేశంలో చర్చించినట్టు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు.
పెరిగిన యాజమాన్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని నెహ్రూ జూపార్ ఎంట్రీ చార్జీలను నామమాత్రంగా పెంచేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇకపై సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.70, సెలవు రోజుల్లో రూ.80, పిల్లలకు రూ.45, సెలవు రోజుల్లో రూ.55 రుసుముగా నిర్ణయించారు. సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్, జూపార్ డైరెక్టర్ వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.