హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): నీట్ పీజీ-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 2.92 లక్షల మంది అభ్యర్థులు నీట్ పీజీకి దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 5న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,953 ఎండీ, 10,821 ఎంఎస్, 1,979 పీజీ డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి.