హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): టెట్ సిలబస్, అర్హత మార్కులు పరీక్షా విధానాన్ని సమీక్షించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఎన్సీటీఈ చైర్మన్ పంకజ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఎస్టీఎఫ్ఐ ప్రతినిధులు పంకజ్ అరోరాను కలిసి టెట్ సమస్యపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈ టెట్ విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సంఘం జాతీయ అధ్యక్షుడు సీఎస్ భార్తి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి ఉన్నారు.