హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహిళా బిల్లు కోసం అహర్నిశలు కృషి చేసిన భారత జాగృతి సంస్థ జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు అన్ని వర్గాల నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా శనివారం ఎమ్మెల్సీ కవితను నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాజు, బీఆర్ రాష్ట్ర సీనియర్ నాయకుడు కోల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఓబీసీ బిల్లుకు మద్దతుపై హర్షం
ఓబీసీ బిల్లు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ కవితకు దేశవ్యాప్తంగా ఓబీసీ తరఫున రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శనివారం వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని బీసీ సంఘాలు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమేగాక, ఉద్యమంలో కలిసి నడుస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బీసీలందరి తరఫున బీఆర్ అధినేత, సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.