హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, ధోబీఘాట్లకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును కొనసాగించాలని నిర్ణయించిన బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు నాయీబ్రాహ్మణ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ధోబీఘాట్లు, సెలూన్లకు సంబంధించి పెండింగ్ విద్యుత్తు బిల్లులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖకు మంత్రి విజ్ఞప్తి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.