హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నూతన జంట నయనతార, విఘ్నేశ్ శివన్ తాజాగా వివాదంలో చికుకున్న సంగతి తెలిసిందే. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడంపై తితిదే అధికారులు ఆ జంటపై చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వివాదంపై వివరణ ఇస్తూ విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని చెప్పుకొచ్చారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉన్నాయని.. తాము తెలియక చేసిన తప్పును క్షమించాలని తితిదేను కోరారు. తిరుమలలోనే పెండ్లి చేసుకోవాలని ఎంతోకాలంగా అనుకున్నామని, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో మహాబలిపురంలో చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
అయితే పైండ్లెన వెంటనే మండపం నుంచి నేరుగా తిరుమలకు వచ్చి స్వామి కల్యాణం వీక్షించి.. ఆశీస్సులు తీసుకోవాలనుకున్నామని, అదేవిధంగా స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. దర్శనం అనంతరం తమ పెళ్లి ఇకడే జరిగిందనే భావన కలగడం కోసం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవాలనుకున్నామని లేఖలో వెల్లడించారు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. తెలియక చేసిన తప్పుకు క్షమించాలని తితిదేను కోరారు.