Warangal | వరంగల్ : వరంగల్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ(58)( Kuppa Padmaja ) ఇకలేరు. నాట్యంలో అనేక అవార్డులు సొంతం చేసుకున్న ఆమె ఓసిటీలోని ఇంటిలో గురువారం రాత్రి గుండెపోటు( Cardiac Arrest ) తో మృతిచెందారు. ప్రముఖ నాట్య గురువు వెంపటి నాగేశ్వరి వద్ద పద్మజ కూచిపూడి( Kuchipudi ) నృత్యాన్ని అభ్యసించారు. ఇందులో ఆమె డిప్లోమాతో పాటు ఎంఏ పూర్తి చేసి, కథక్ నృత్యంలోనూ ప్రావీణ్యం సాధించారు.
1992 నుంచి వరంగల్( Warangal ) లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేశారు. అనంతరం ఐదు సంవత్సరాల పాటు ఇన్చార్జి ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. నగరానికి చెందిన డాక్టర్ ఉమా మహేశ్వర్రావు రచించిన మహిషాసురమర్ధిని నృత్య నాటికకు డ్యాన్స్ కంపోజ్ చేసి, అనేక ప్రదర్శనలు ఇస్తూ పేరు ప్రఖ్యాతులు పొందారు.
వరంగల్తో పాటు హైదరాబాద్( Hyderabad ) దూరదర్శన్లో పలు నృత్య ప్రదర్శనలిచ్చారు. పద్మజ మృతి కళాలోకానికి తీరని లోటని పలువురు కళాకారులు, శిష్యులు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పద్మజ ఇంటికి వెళ్లి ఆమె నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.