చిక్కడపల్లి, జనవరి 20: కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక, దేశ విధ్వసంకర విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జాతీయ ఫెడరేషన్లు నిరసన గళమెత్తనున్నాయి. సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23, 24 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశంలో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కే హేమలత, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే విధానాలు మోదీ సర్కారు చేపట్టిందని మండిపడ్డారు. ఈ నెలాఖరులోపు అన్ని జిల్లాల్లో సమ్మె భాగస్వామ్య కార్మిక, ఉద్యోగ సంఘాల జాయింట్ సమావేశాలు నిర్వహించాలని, ఫిబ్రవరి 15లోపు జిల్లా సదస్సులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్రావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్కుమార్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు దానకర్ణాచారి, టీయూటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే బోస్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ, ఏఐయూటీయూసీ బాబురావు, సీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.