హైదరాబాద్ : ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో మహేంద్ర హిల్స్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల కాన్హా శాంతి వనంలో రసాయన శాస్త్ర సాంకేతికత సుస్థిర అభివృద్ధి – అవకాశాలు, అవరోధాలు అనే అంశంపై కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వారు రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించారు.
ప్రతిష్టాత్మకమైన జాతీయ శాస్త్ర సాంకేతిక విభాగ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్ తొలి రోజు ముఖ్య అతిథిగా హాజరై సమకాలీన రసాయన శాస్త్రంలో జరుగుతున్న పరిశోధనలు – యువత నూతన ఆవిష్కరణలలో, విద్యార్థుల భాగస్వామ్యం గురించి వివరించారు.
ఈ జాతీయ సదస్సుకు అధ్యక్షులుగా గురుకులాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఉపకార్యదర్శి హనుమంత్ నాయక్, ముఖ్య ఆహ్వానితులుగా అనురాగ్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, విశిష్ట అతిథిగా హెచ్సీయూ వీసీ ప్రొఫెసర్ బీ జగదీశ్వర్ రావు హాజరయ్యారు. ఈ సదస్సు యొక్క మౌలిక విశిష్టతను వారి సందేశాలలో తెలియజేశారు. జాతీయ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన కళాశాల అధ్యాపకులు, విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిరూప అభినందనలు తెలిపారు.