NQAS Certificate | జూలపల్లి, మార్చి 13: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ (ఎన్క్యూఏఎస్) సర్టిఫికెట్ వరించింది. నిరుడు డిసెంబర్ 29, 30 తేదీల్లో నేషనల్ క్వాలిటీ టీమ్ సభ్యులు దవాఖానలను సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ల నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, వసతులను పరిశీలించి నివేదికలు రూపొందించారు.
ఇందులో భాగంగా ఎన్క్యూఏఎస్ సంస్థ దవాఖానల పనితీరుపై ఫలితాలు విడుదల చేయగా.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం హెల్త్ వెల్నెస్ సెంటర్ (94 శాతం), జగిత్యాల జిల్లా దొంతాపూర్ హెల్త్ వెల్నెస్ సెంటర్ (93 శాతం), పెద్దపల్లి జిల్లా జూలపల్లి పీహెచ్సీ (82.3 శాతం) మార్కులతో సత్తాచాటాయి. ఈ సందర్భంగా మూడు దవాఖానలకు క్వాలిటీ సర్టిఫికెట్లు జారీ చేశారని జూలపల్లి మండల వైద్యాధికారి సంపత్రెడ్డి తెలిపారు.