హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ఇస్రో గగన్యాన్ అంతరిక్ష యాత్రలో హైదరాబాద్ వేదికగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) భాగస్వామ్యం కానున్నది. అంతరిక్ష యాత్ర కు వెళ్లే వ్యోమగాములకు అవసరమైన ప్రత్యేక ఆహార ప్రోటోకాల్ను రూపొందించనున్నది.
ఇప్పటికే ఎన్ఐఎన్తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకొన్నది. వచ్చే ఏడాది నాటికి తొలుత వెళ్లనున్న ముగ్గురు వ్యోమగాములు మూడు రోజులపాటు పర్యటించనున్నారు. వీరికి భారతీయ పౌష్టికాహారం అందిస్తారు.