హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్టేట్ లెవల్ ఎగ్జామ్ ఈ నెల 27న నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:3ం గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు ఈ నెల 21 నుంచి http//bse.telangana.gov. in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.