Singareni | సింగరేణి సంస్థ ఏపీఏ పరిధి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ALP)కి 2023-2024 సంవత్సరానికి జాతీయ అవార్డు దక్కింది. ‘బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్’ అవార్డు వరించింది. ఏపీఏ జీఎం కే వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కే నాగేశ్వర రావు, అడిషనల్ మేనేజర్ శ్రీకాంత్ ‘డీప్ అండర్ గ్రౌండ్ కోల్ మైనింగ్’లో సమర్థత, భద్రత పెంపు, ఇంటిగ్రేటెడ్ ఏయిర్ కూలింగ్, ట్యూబ్ బండిల్ గ్యాస్ మానిటరింగ్ సిస్టమ్లతో కూడిన ఏఎల్పీ కేస్ స్టడీని సమర్పించారు. ఈ మేరకు ఆధారంగా బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్ 2023-2024 కేటగిరీలో భాగంగా భువనేశ్వర్లో జరిగిన సదస్సులో ఏఎల్పీ గనికి అవార్డు దక్కింది. గని మేనేజర్ ములుకుంట్ల తిరుపతి ఈ అవార్డును అందుకున్నారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉన్నది. ఇది దేశంలోనే అతిపెద్ద భూగర్భ బొగ్గు గని.