కరీంనగర్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలో జీపీఎస్, ఈపీవోఎస్ ద్వారా చేపడుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ చాలా బాగుందని జాతీయ ఆహార భద్రత చట్టం కేంద్ర బృందం లీడర్ ఉపేందర్సింగ్, అసోసియేట్ టీం లీడర్ జీఎన్శర్మ ప్రశంసించారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013పై నిర్వహించిన అవగాహన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృంద సభ్యులకు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు రేషన్ పంపిణీ గురించి వివరించారు.
చౌకధరల దుకాణాల సంఖ్య పెంచి అందరికీ బలవర్ధక (ఫోర్టిఫైడ్) బియ్యాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, డీఆర్డీవో శ్రీలత, జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నేతినియాల్, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్, జిల్లా పౌర సరఫరా సంస్థ మేనేజర్ శ్రీకాంత్, కొత్తపల్లి జడ్పీటీసీ కరుణ పాల్గొన్నారు.