హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ఐదుగురు నర్సులకు ది నేషనల్ ప్రెస్ కౌ న్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేప ర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక సం యుక్తంగా ఏటా ఇచ్చే ‘నేషనల్ ఫ్లోరె న్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డులు ల భించింది. అంతర్జాతీయ నర్సుల ది నోత్సవం సందర్భంగా మంగళవారం బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ నజీర్ నుంచి అవార్డులు అందుకొన్నారు.
వీరిలో ఆరోగ్యజ్యోతి, కట్కూరి రాణి, ఉపత్ ఉన్నీసా ప్రభుత్వ దవాఖాన నర్సులు. ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా దవాఖాన హెడ్నర్సుగా పనిచేస్తుండగా, రాణి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీహెచ్సీ స్టాఫ్నర్సు. ఉపత్ ఉన్నీసా నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా దవాఖాన స్టాఫ్ నర్సుగా ఉన్నారు. మిగతా ఇద్దరిలో సంజులవర్మ హైదరాబాద్ కేర్ దవాఖనలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ కాగా, సిస్టర్ సరితమేరీ సెయింట్ థెరీసా దవాఖనలో నర్సింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.