హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఫాసిస్టు, మతతత్వ విధానాలు దేశానికి ప్రమాదకరమని భారత విద్యార్థి సమాఖ్య మాజీ జాతీయ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంతోపాటు సాంస్కృతిక రంగం, జాతీయవాదంపై విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభల్లో బుధవారం వారు సౌహార్ధ సందేశమిచ్చారు. కాషాయీకరణ, ప్రైవేటీకరణ, వ్యాపారీకరణతో మోదీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షులు ఎంఏ బేబి, వై వెంకటేశ్వరరావు విమర్శించారు. యువతకు ఉపాధి కల్పిం చకుండా బీజేపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఎస్ఎఫ్ఐ మాజీ ప్రధాన కార్యదర్శి నీలోత్పల్ బసు ధ్వజమెత్తారు.
దేశంలోని అన్ని వర్సిటీలు, విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు దిప్సితా ధార్, నితీశ్ నారాయణ్, రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు టీ నాగరాజు, ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల్లో భాగంగా బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న నీట్, జేఈఈ, సీయూఈటీ తదితర ప్రవేశ పరీక్షలను ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఎన్ఈపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని చెప్పారు.