హైదరాబాద్, జనవరి 25: ఉత్తమ సేవలందించిన రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ మంగళవారం పతకాలు ప్రకటించింది. ఇందులో రాష్ట్రం నుంచి ఇద్దరికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, 11 మందికి విశిష్ట సేవా పతకాలు రాగా, జైళ్ల శాఖలో ముగ్గురికి కరెక్షనల్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు, అగ్నిమాపక శాఖలో ఒకరికి ఫైర్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు వచ్చాయి. దేశవ్యాప్తంగా 939 మంది పోలీసులకు అవార్డులు దక్కాయి. వాటిలో 189 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ(పీఎంజీ), 88 మందికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డస్టింగిష్డ్ సర్వీసెస్, 662 మంది పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్(విశిష్ట సేవా పతకాలు) దక్కాయి.
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్:
టీఎస్ఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్ చాకో సన్నీ
పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్(పీటీవో) హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరాజు
విశిష్ట సేవా పతకాలు దక్కింది వీరికే..
షానవాజ్ ఖాసీం, ఐజీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్
సంక్రాంతి రవికుమార్, అడిషనల్ డీసీపీ, ఎస్బీ, సైబరాబాద్
పుల్ల శోభన్కుమార్, అడిషనల్ ఎస్పీ,
జయశంకర్ భూపాలపల్లి
రాయప్పగారి సుదర్శన్, అడిషనల్ ఎస్పీ,
ఇంటెలిజెన్స్, హైదరాబాద్
పోల్గాని శ్రీనివాసరావు, డీఎస్పీ,
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్
జీ శ్రీనివాసులు, డీఎస్పీ, ఐటీ కమ్యూనికేషన్స్
కేఎం కిరణ్కుమార్, డీఎస్పీ, వనపర్తి సబ్ డివిజన్
మహ్మద్ యాకూబ్ ఖాన్, ఆర్ఎస్సై, ఇంటెలిజెన్స్
బెండి సత్యం, ఏఆర్ఎస్సై, ఏడో బెటాలియన్ డిచ్పల్లి
మెట్టు వెంకటరమణారెడ్డి, ఏఆర్ఎస్సై, గ్రేహౌండ్స్
ఐలపండ కోటేశ్వరరావు, హెడ్కానిస్టేబుల్,
8వ బెటాలియన్, కొండాపూర్
జైళ్ల శాఖ (కరెక్షనల్ సర్వీస్ మెడల్ ఫర్
మెరిటోరియస్ సర్వీస్ అవార్డు)
చీఫ్ హెడ్ వార్డర్ ఎం పంతు
హెడ్ వార్డర్ గంట రత్నారావు
హెడ్ వార్డర్ బీ నర్సింగ్రావు
ఫైర్ సర్వీసెస్ (ఫైర్ సర్వీస్ మెడల్ ఫర్
మెరిటోరియస్ సర్వీస్)
డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ కాళహస్తి వెంకటకృష్ణకుమార్
సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్కు పోలీస్ పతకం
మారేడ్పల్లి: సికింద్రాబాద్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న యూ నరసింహకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ పోలీస్ పతకం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పతకాన్ని ప్రకటించింది. 1996లో సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్టీసీలో చేరిన నరసింహ.. రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రతకు గత 26 ఏండ్ల నుంచి విశేష సేవలందిస్తున్నారు. 2010లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది కాజీపేట, వరంగల్లో విధులు నిర్వర్తించారు.