హైదరాబాద్, మార్చి 26 : రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు అరుదైన గౌరవం దక్కిం ది. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జి ఔట్స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకొన్నది. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ ఈ అవార్డును ప్రదానం చేసిం ది. శనివారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఆర్అండ్బీ ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి ఈ అవార్డును రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ అవార్డు.. తెలంగాణ సర్కారు పనితీరుకు నిదర్శనమన్నారు. రోడ్లు, భవనాలశాఖ అధికారులు, ఉద్యోగుల్లో నూతనోత్సాహం నింపుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సర్కారు నిబద్ధత, పనితీరును గుర్తించి అవార్డు అందించిన ఇండియన్ కాంక్రీ ట్ ఇన్స్టిట్యూట్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.