హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సాహితీవేత్త, కవి మామిడి హరికృష్ణ ‘మహాకవి పంపన జాతీయ పురస్కారం-2026’కు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం అక్షరయాన్ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదలచేసింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు మార్గదర్శనంలో 2021 నుంచి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ తెలిపింది.