హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 20: హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండల భారతమాత మహిళా సమాఖ్యకు వరుసగా రెండోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రత్యేక ఫెడరేషన్ జ్యూరీ నుంచి.. 2023 జాతీయ పురస్కారానికి ఎంపిక అయినట్టుగా అవార్డు అనౌన్స్మెంట్ లేఖ బుధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అందింది. హైదరాబాద్లో అక్టోబర్ 10, 11న జరిగే జాతీయ స్థాయి ఎస్హెచ్జీ ఫెడరేషన్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డును అందిస్తామని ఆ లేఖలో ఆహ్వానించారు.